ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 25 : రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు. రూపాయికో మొక్కను చొప్పున అమ్ముతుండడంతో రూ. లక్ష ల్లో విక్రయాలు సాగుతున్నాయి. గతంలో కూరగాయల సాగు కు పంట భూముల్లో నారు పోసి, అవి పెద్దగా మారిన తర్వాత విక్రయించేవారు. ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇండ్లు, పరిసర ప్రాంతాల్లో కుండీలను ఏర్పాటు చేసి కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో వారికి కావాల్సిన మొక్కల కోసం నర్సరీలకు వెళ్లి కొనుగోలు చేస్తుండడంతో అక్కడ పెంచుతున్న మొక్కలను డిమాండ్ పెరుగుతున్నది.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, కందుకూరు, మహేశ్వరం, షాబాద్, షాద్నగర్, చేవెళ్ల తదితర మండలాల్లోని పలువురు రైతులు, యువకులు నర్సరీలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఎకరా భూమిలో ఇరిగేషన్ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి హైబ్రిడ్ రకానికి చెందిన టమాట, బీరకాయ, వంకాయ, గోబీపువ్వు, క్యాబేజీ, మిరపతోపాటు పండ్లు, పూల మొక్కలను సాగు చేస్తున్నారు. ఇందుకోసం మినీఫారంలు, షెడ్లను ఏర్పా టు చేసి ప్లాస్టిక్ కుండీల్లో వివిధ రకాల విత్తనాలు వేసి మొక్కలను పెంచుతున్నారు. కొబ్బరి పీచుతోపాటు నల్లమల్లి, సేంద్రి య ఎరువులను వినియోగిస్తూ మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకొంటున్నారు. విత్తనాలు నాటిన పది రోజుల్లోనే మొలక వస్తున్నది. ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రతి మండలంలోనూ రెండు నుంచి 10 వరకు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన మొక్కలను విక్రయిస్తున్నారు. రైతులు సాగు చేసే వంకాయ, టమాట, మిరప, బెండకా య, క్యాబేజీతోపాటు పలు రకాల పండ్లు, పూలమొక్కలను నర్సరీల్లో అం దుబాటులో ఉంచుతున్నారు. దీంతో రైతుల ఈ నారుతో పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
గతంలో కూరగాయలు సాగు చేయాలంటే ముందుగా విత్తనాలు కొనుగోలు చేసి నారుపోసి పంటలు సాగుచేసేవాళ్లం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైబ్రిడ్క్రం కూరగాయల నారు ప్రైవేట్ నర్సరీల్లో లభిస్తున్నది. రూపాయి నుంచి రెండు రూపాయల వరకు నాణ్యమైన నారును విక్రయిస్తున్నారు. ఈ నారుతో ఎంతో దిగుబడి వస్తున్నది.
– మొద్దు అంజిరెడ్డి, ఉత్తమ రైతు