వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ):రైతులు సం క్రాంతిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతోపాటు రాష్ట్ర ట్రెజరీకి రైతుల వివరాలను అందించింది. యా సంగి సాగుకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో 2,44,126 మంది రైతు లు అర్హులు కాగా వారికి పెట్టుబడి సాయంగా రూ.299 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. అయితే నేడు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ.5వేల చొప్పున వారి ఖాతా ల్లో డబ్బులు జమకానున్నాయి. జిల్లాలో రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 70 వేల మంది రైతులకు నేడు పెట్టుబడి సాయం అందనున్నది. కాగా వానకాలానికి సంబంధించి 2,47,232 మంది రైతులకు రూ.304 కోట్లను సాయంగా ప్రభుత్వం అందించింది. అయితే రైతులు పం టల సాగు కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బం దులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని గత ఐదేండ్లుగా అందిస్తూ రైతన్నలను ఆదుకుంటున్నాడు. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రెండు విడుతల్లో ప్రభు త్వం సాయాన్ని అందిస్తున్నది. పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటామని రైతన్నలు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. వారికోసం పలు సంక్షే మ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ను సరఫరా చేసిన ప్ర భుత్వం.. అనంతరం రెండేండ్ల కాలం నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తున్నది. అదేవిధంగా రైతు ఏ కారణంతో నైనా మృతి చెందితే రైతుబీ మా పథకం కింద ఆ బాధిత కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలుస్తున్నది. రైతుబంధు పథకం కింద ఐదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,210 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం
అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 1,94,123 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,854 మంది రైతులకు రూ. 206కోట్లు, 2019 వానకాలంలో 1,87,377 మందికి రూ.240 కోట్లు, యాసంగిలో 1,51, 647 మందికి రూ.169 కోట్లు, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మందికి రూ.301 కోట్లు, 2021 వానకాలంలో 2,25,438 మం దికి రూ.300 కోట్లు, యాసంగిలో 1,94,072 మందికి రూ.169 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందజేసింది. అదేవిధంగా 2022-23 వానకాలంలో 2,47,232 మంది రైతులకు రూ. 304 కోట్లను పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.