షాబాద్, మే 17: గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,170 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 573 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 623 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాల కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాల కు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయిం చుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృం దాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు న్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లాలో 5,401 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 564 మందికి రీడిం గ్ గ్లాసులు పంపిణీ చేయగా, 531 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 458 గ్రామాలు, 87 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.