షాద్నగర్ : దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీకి చెందిన పలువురు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకంలో దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని, సీఎం కేసీఆర్ దళితుల ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాలనీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని బాగుపడాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జమృత్ఖాన్, సురేష్, వినోద్, లక్ష్మయ్య, అంజయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.