ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 8 : భూగర్భజలాలు తగ్గడం, బోర్లు ఎండిపోవడం, విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్ల్లు పడుతున్నారు.
పంటలను ఎండబెట్టుకోలేక కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్-లింగంపల్లి గ్రామాల మధ్యన ఓ రైతు కొత్తిమీర సాగుకు ఇలా ట్యాంకర్ ద్వారా నీరందిస్తుండగా ‘నమస్తేతెలంగాణ’ క్లిక్మనిపించింది.