రంగారెడ్డి, జూలై 7(నమస్తే తెలంగాణ)/ వికారాబాద్: ఉమ్మడి జిల్లాలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 2,86,258 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.223.24కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అలాగే వికారాబాద్ జిల్లాలో 2,33,740 మంది అన్నదాతలకు రూ.213.82 కోట్లను అందజేసింది.
పెట్టుబడి సాయం అందుకుంటున్న అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది. ఫోన్కు మెసేజ్లు వస్తుండడంతో బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్న రైతులు ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.