కడ్తాల్, ఏప్రిల్ 4 : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో తహసీల్దార్ మురళీకృష్ణ అధ్యక్షతన 84 మందికి కల్యాణలక్ష్మి, ముగ్గురికి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులు పేదింటి ఆడబిడ్డల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్గా మారిందన్నారు.
బీటీ రోడ్లకు రూ.36.93 కోట్లు మంజూరు
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ గ్రామాల్లోని గిరిజన తండాలకు ఎస్టీ సబ్ ప్లాన్లో భాగంగా బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.36.93 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల్ మండలంలోని చల్లంపల్లి గ్రామం నుంచి నార్లకుంట తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.30 కోట్లు, చరికొండ నుంచి బోయిన్గుట్ట తండాకు రూ.2.10 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వెలుగురాళ్ల తండాకు రూ.1.20 కోట్లు, అన్మాస్పల్లి నుంచి పుల్లేరుబోడు తండాకు రూ.1.20 కోట్లు, కడ్తాల్ నుంచి కాన్గుబావి తండాకు రూ.1.20 కోట్లు, అన్మాస్పల్లి రోడ్డు నుంచి పోచమ్మగడ్డ తండాకు రూ.75 లక్షలు, బాలాజీనగర్ తండా నుంచి వాసుదేవ్పూర్కి రూ.1.50 కోట్లు, చల్లంపల్లి గ్రామం నుంచి రేకులకుంట తండా బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్ల్ల నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మండల కేంద్రంలో ఎంపీడీవో భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, తహసీల్దార్ భవన నిర్మాణానికి అదనంగా రూ.50 లక్షలు, గ్రంథాలయానికి రూ.కోటి, మహిళా సమాఖ్య భవనానికి రూ.20 లక్షలు నిధులు మంజూరయ్యాయని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, రవీందర్రెడ్డి, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, సులోచన, సుగుణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, శ్రీనివాస్రెడ్డి, రాములుగౌడ్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, అనిల్యాదవ్, నర్సింహ, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్
ఆమనగల్లు : గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండల కేంద్రంలోని గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను గిరిజన నాయకులు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండల కేంద్రంలో జంజారా భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రూ. 2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన తండాల నుంచి గ్రామ పంచాయతీలకు లింక్ రోడ్డు ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి మొత్తం 35 రోడ్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. చారకొండ , వెల్డండ, కల్వకుర్తి మండలాల్లో రూ. 11 కోట్లతో 13 రోడ్లు, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో రూ. 37 కోట్లతో 22 రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చిరు వ్యాపారస్తులు రోడ్డు వెడల్పు తగ్గించాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గిరిజన భవనానికి రూ. 2 కోట్లు విడుదల చేసినందుకు బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు అర్జున్రావు, అప్పం శ్రీనివాస్, గిరిజన నాయకులు , మహిళలు పాల్గొన్నారు.
సమ్మేళనాలను విజయవంతం చేయండి
మాడ్గుల : మండలం పరిధిలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. 7వ తేదీన ఆర్కపల్లిలో, 19వ తేదీన మాడ్గులలో, 21వ తేదీన ఇర్విన్లో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.