కొడంగల్, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తుందని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, బీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు నవాజుద్దీన్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు సామాన్యులు బెంబేలెత్తుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. వంట గ్యాస్ ధరను మళ్లీ రూ.50, కమర్షియల్ గ్యాస్ ధర రూ. 350ల చొప్పున పెంచిందన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెంచిన ధరను వెంటనే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వెంటనే తగ్గించాలి..
బొంరాస్పేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని, వారిపై మోయలేని భారం మోపుతుందని బీఆర్ఎస్ బొంరాస్పేట, దుద్యాల మండలాల అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు. గురువారం బొంరాస్పేటలో వారు విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలను పెంపును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు కృష్ణ, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, శ్రావణ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు టీటీ రామునాయక్, రమణారెడ్డి, రామకృష్ణయాదవ్, రవిగౌడ్, సుభాష్రావు, అంజిలయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
నేడు బొంరాస్పేటలో నిరసన కార్యక్రమాలు
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం బొంరాస్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ బొంరాస్పేట మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హాజరవుతున్నారని, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
నేడు గ్యాస్ పెంపుపై నిరసన కార్యక్రమాలు
తాండూరు : కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాల్లో పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, బీఆర్ఎస్ అధికారప్రతినిధి వెంకట్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పాటు ముఖ్య నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయా మండలాల అధ్యక్షులు పేర్కొన్నారు.