షాద్నగర్రూరల్, అక్టోబర్ 17 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండలంలోని అతి పురాతన ఎలికట్ట భవానీమాత ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.