కొత్తూరు, సెప్టెంబర్ 25 : కొత్తూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడంతో వేగం పుంజుకున్నాయి. కొత్తూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత.. గత సార్వత్రిక ఎన్నికలకు ముం దు మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఇచ్చిన హామీ కంటే అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయించారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో రూ.32 కోట్లతో సీసీ రో డ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల పనులు చురుగ్గా సాగుతుండటంతో స్థానికులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 32 కోట్లతోజోరుగా సాగుతున్న పనులు
కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. ఈ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 32 కోట్లు మంజూరు చేసింది. వార్డుల వారీగా ఒకటో వార్డుకు రూ. 163.08 కోట్లు, రెండోవార్డుకు 228.56, మూడోవార్డుకు 227.20, నాల్గోవార్డుకు 196.59, ఐదోవార్డుకు 105, ఆరోవార్డుకు 186.16, ఏడోవార్డుకు 217.80 , ఎనిమిదోవార్డుకు 252.85, తొమ్మిదో వార్డుకు 158.55, పదోవార్డుకు 197.90, 11వ వార్డుకు 288.54, 12వ వార్డుకు143.67 కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధులతో వార్డు ల్లో అవసరమున్న చోట మొదటగా అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. అనంతరం సీసీ రోడ్లు వేస్తున్నారు. అయితే అప్పటికే చాలా వార్డుల్లో పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని వార్డుల్లోని గల్లీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి వాటిపై సీసీ రోడ్లు వేస్తున్నారు. 7, 8,10 వార్డుల్లోని చాలా గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తైంది. తిమ్మాపూర్, కుమ్మరి గూడ, స్టేషన్తిమ్మాపూర్, తిమ్మాపూర్ పరిధిలోని 1, 2, 3, 12వ వార్డుల్లో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేయగా.. ఆ పనులు కూడా గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోడ్ల నిర్మాణం పూర్తైతే కొత్తూరు కొత్త రోడ్లతో కళకళలాడనున్నది.
కొత్తూరు రూపురేఖలు మార్చుతా..
కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశాం. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.32 కోట్లు కేటాయిం చాం. ఈ పనులు పూర్తైతే కొత్తూరు సుందరంగా మారనున్నది. మున్సిపాలిటీలోని 12 వార్డులో స్వయంగా తిరిగి రోడ్లను పరిశీలించా. మిషన్ భగీరథ పైపులైన్ పనుల వల్ల కొన్ని రోడ్లు పాడయ్యాయి. ఇప్పటివరకు మట్టి రోడ్లుగా ఉన్నవి కూడా సీసీలుగా మారుతాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధం.
– అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే షాద్నగర్
ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి ఇప్పటికే రూ.32 కోట్లు మంజూరయ్యాయి. దీంతో రోడ్లు, డ్రైనేజీల పనులు శరవేగం గా జరుగుతున్నాయి. నిధులను మంజూరు చేయించి న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాతుక లావణ్య, మున్సిపల్ చైర్పర్సన్, కొత్తూరు