తెలంగాణ రాక ముందు సమస్యల ఊబిలో పల్లెలు, పట్టణాలు కొట్టుమిట్టాడాయి. అభివృద్ధి పనులైతే కలగానే మిగిలాయి. ప్రభుత్వాలు మారినా షరా మామూలే అయ్యేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పల్లెలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అమోఘమైన అభివృద్ధి జరిగింది. పక్కా పారిశుధ్యంతో నేడు పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలతో ఏ వీధి చూసినా అద్భుతంగా కనిపిస్తున్నది. ఊరు, వాడ, పట్టణం విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్నాయి. పల్లెల్లో ప్రకృతి వనాలు, పట్టణాల్లో పార్కులు, మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుతో జనం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. నాడు తాగునీటికి నానా తంటాలు పడితే, నేడు ఇంటింటికీ సరిపడా తాగునీరు సరఫరా అవుతున్నది. హరితహారంలో భాగంగా ఏ రోడ్డు చూసినా పచ్చని తోరణాల్లా మొక్కలు దర్శనమిస్తున్నాయి. వైకుంఠధామాల నిర్మాణాలతో చివరి మజిలీకి సమస్యలు తీరాయి. డంపింగ్ యార్డులను నిర్మించి, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి వర్మీ కంపోస్ట్ ఎరువును సైతం తయారు చేస్తున్నారు. ప్రమాద ఘంటికలుగా మారిన శిథిల భవనాల కూల్చివేత, పడావు బావులను పూడ్చడంతో ఏండ్ల తరబడి ఉన్న ముప్పు తప్పింది. ఏ ఊరికెళ్లినా వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామాలుగా మారాయి. దీర్ఘకాలిక సమస్యలు సమసిపోయి పల్లెలు, పట్టణాల ముఖచిత్రాలు మారడంతో ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– షాబాద్, మే 17
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు సుందరంగా మారుతున్నాయి. గతంతో పోలిస్తే చాలావరకు మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో ఏ గ్రామానికెళ్లినా ఊరి బయట చెత్త, పెంట కుప్పలు దర్శనమిచ్చేవి. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలతో మరింత ఇబ్బందులు ఉండేవి. పట్టణాల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా చెత్తాచెదారం, తుమ్మచెట్లు, మురికి నీటి గుంటల్లో పందుల స్వైర విహారం కనిపించేది. కానీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులను అధికారులు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.303 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా..పట్టణ ప్రగతి కింద రూ.27.87కోట్లు వచ్చాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు ఇప్పటివరకు రూ. 104 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్
పరిగి మున్సిపాలిటీకి రూ.4.38 కోట్లు విడుదల
పరిగి, మే 17: పట్టణ ప్రగతి కార్యక్రమంతో పరిగి పట్టణ రూపురేఖలు చాలావరకు మారిపోయాయి. ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పరిగి పట్టణ జనాభా 25వేల వరకు ఉంటుం ది. పరిగి మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి కింద 2020 ఫిబ్రవరి నుంచి గత మార్చి నెల వరకు రూ.4.38 కోట్లు విడుదలయ్యాయి. ప్రతినెలా నిధులు విడుదలవుతుండటంతో పరిగి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 2019-20లో రూ.9.33 లక్షలు పట్టణ ప్రగతి పనులకు, రూ.8.58 లక్షలు హరితహారానికి విడుదలయ్యాయి..అదేవిధంగా 2020-21లో పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూ. 8.50లక్షలు, హరితహారం కింద రూ.28.70 లక్షలు, 2021-22లో పట్టణ ప్రగతి కింద రూ.12.66 లక్షలు, హరితహారానికి రూ.5.44 లక్షలను ఖర్చు చేశారు. పట్టణ ప్రగతి కింద ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేట్ స్థలాల్లోనూ ముళ్ల పొదలు, మురికిగుంటల తొలగింపు, పాడుబడిన బావుల మూసివేత, చిన్న కల్వర్టుల నిర్మాణం తదితర పనులకు ఈ నిధులను వినియోగించారు. హరితహారంలో భాగంగా 2019-20లో 55వేల మొక్కలు, 20-21లో లక్షా10వేలు, 2021-22లో 60 వేల మొక్కలు నా టడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలను కూడా పంపిణీ చేశారు. ఇందులో సుమారు 85 శాతం మొక్కలు బతికాయి.
వాహనాల కోసం రూ. కోటీ 8 లక్షలు..
పరిగి మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ కోసం 2019-20లో రూ.14 లక్షలతో నాలుగు ఆటోలు, రూ.7లక్షలతో ఒక ట్రాక్టర్, రూ.2 లక్షలతో ట్యాం కర్, 2021-22లో రూ.28 లక్షలతో నాలుగు ఆటోలు, రూ.6.5 లక్షల తో రెండు ఎలక్ట్రిక్ ఆటోలు, రూ.43 లక్షలతో స్వీపింగ్ మిషన్, రూ. 7.5 లక్షలతో ట్రాక్టర్, రూ.1.60 లక్షలతో రెండు ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఇంటింటికీ రెండు డబ్బాలను అందించారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు.
వికారాబాద్ మున్సిపాలిటీ దశ తిరిగింది..
వికారాబాద్, మే 17: పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ మున్సిపాలిటీ దశ తిరిగింది. ఈ మున్సిపాలిటీలో గతంలో 28 వార్డులు ఉండేవి.. ప్రస్తుతం ఆరు గ్రామాలు ఇందులో చేయడంతో ఆ వార్డుల సంఖ్య 34కు చేరి పట్టణ పరిధి పెరిగిం ది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న నిధులతో వార్డుల్లో ఏండ్ల తరబడిగా పేరుకుపోయిన పలు సమస్యలకు పరిష్కారం లభించింది. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, తడి, పొడి చెత్తను వేరు చేయడం, పెంట కుప్పల తొలగింపు తదితర అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేకాకుండా మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి పచ్చదనం పెంపునకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి పట్టణ ప్రగతి పనులకు సజావుగా చేపడుతున్నారు. హరిత హారంలో ఒకే సారి మొక్కలను నాటడంతో అవార్డులొచ్చాయి. పట్టణ ప్రగతి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.1.26 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు.
వార్డుల్లో ప్రగతి పరుగులు
తాండూరు, మే 17: పల్లె ప్రగతి కార్యక్రమంతో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులను అధికారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పల్లె ప్రగతి ద్వారా ఇప్పటివరకు విడుదలైన రూ.8.15 కోట్లతో అన్ని వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రూ.1.52 కోట్లతో 18 ఆటోలు, విద్యుత్ చార్జీల చెల్లింపు, కార్మికుల జీతాలను ఆ నిధుల నుంచి వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ పరిశుభ్రతకు అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తకుప్పలు, మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికే గుంతల పూడ్చివేత, పాత ఇండ్లు, గోడల కూల్చివేత పనులను చేపట్టారు. అంతేకాకుండా మొక్కలను పెంచుతున్నారు. వార్డుల్లో ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి పారిశుధ్య కార్మికులు సేకరించిన తడి, పొడి చెత్తను తాండూరు సమీపంలోని అత్తారం దగ్గర ఉన్న డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. పార్టీలకతీతంగా అందరూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తుండటంతో పట్టణంలోని వార్డుల ముఖచిత్రం మారిపోతున్నది.
ప్రగతి పథంలో కొడంగల్ మున్సిపాలిటీ
కొడంగల్, మే 17: కొడంగల్ మున్సిపాలిటీ పట్టణ ప్రగతితో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. గతంలో నిధుల్లేక మున్సిపాలిటీ అభివృద్ధిలో అన్నింటా వెనుకబడి ఉండేది. కాగా సీఎం కేసీఆర్ పాలనలో ప్రతినెలా మున్సిపాలిటీకి రూ. 13లక్షల నిధులు మంజూరవుతున్నాయి. పట్టణప్రగతి, హరితహారం కింద మున్సిపా లిటీకి ఇప్పటివరకు రూ.7కోట్ల 94లక్షలు మంజూరు కాగా వాటితో శానిటేషన్, హరితహారం తదితర పలు అభివృద్ధి పనులను చేపట్టారు. పట్టణంలోని లాహోటీ కాలనీలో మూడు పట్టణ ప్రకృతివనాలను ఏర్పాటు చేసి అందులో 2500 మొక్కలను నాటారు. అదేవిధంగా ఆయా లేఅవుట్లలోనూ మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. మురుగు, చెత్తకుప్పలు, ముళ్ల కంపల తొలగింపు పనులను పారిశుధ్య కార్మికులు చేపడుతున్నారు. రూ.ఐదు లక్షలతో మరుగుదొడ్లను నిర్మించారు. పట్టణ ప్రగతి నిర్వహించక ముందు నిధుల్లేక మున్సిపాలిటీ పరిధిలో కేవలం మూడు కిలోమీటర్ల దూ రం వరకే మురుగు కాలువలను శుభ్రం చేసేవారు. ప్రస్తుతం ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు శుభ్రం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వేనంబర్ 1035 లోని ఐదు ఎకరాల స్థలంలో నర్సరీని ఏర్పాటు చేసి అందులో 50వేల మొక్కలను పెంచుతున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డును ఏర్పా టు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ రెండు బట్టలను పంపిణీ చేశారు. 2020 ఫిబ్రవరి నుంచి ప్రస్తుతం వరకు దాదాపు రూ.3కోట్ల 38 లక్షలు మున్సిపాలిటీకి మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. ఈ నిధులతో సిబ్బందికి వేతనాలు, కరెంటు బిల్లు, తాగునీటి సరఫరాతోపాటు పలు పనులను చేపడుతున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీలో 1260 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశామన్నారు.
పల్లె ప్రగతి కింద వికారాబాద్కు రూ.303 కోట్లు..
పరిగి, మే 17: వికారాబాద్ జిల్లా పరిధిలో 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలోని 566 గ్రామపంచాయతీలకు 2019 సెప్టెంబర్ నుంచి గత ఏప్రిల్ నెల వరకు రూ.303 కోట్ల నిధులను ప్రభుత్వం పల్లెప్రగతి కింద మంజూరు చేసింది. అదేవిధంగా నాలుగు మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.27.87 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.11.96 కోట్లు, తాండూరుకు రూ.8.15 కోట్లు, పరిగికి రూ.4.38 కోట్లు, కొడంగల్కు రూ.3.38 కోట్ల నిధులు అందాయి. 566 గ్రామపంచాయతీల్లో ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ. 12 లక్షలు చొప్పున రూ.67.92 కోట్లు ఖర్చు కాగా.. రూ.2.50 లక్షలతో జిల్లా వ్యాప్తంగా రూ.14.15 కోట్లు వెచ్చించి కంపోస్ట్ షెడ్లను అధికారులు నిర్మించారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, డోజర్, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. ప్రతి పల్లె ప్రకృతివనంలో 40 గుంటల్లో నాలుగు వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో నాలుగు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఆటోలు, ట్రాక్టర్ల కొనుగోలుతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లోని ముళ్ల పొదలు, చెత్తాచెదారం తొలగింపు పనులను చేపడుతున్నారు. తద్వారా పల్లెలు, పట్టణాలు సుందరంగా మారేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు ఎంతో దోహదం చేశాయని చెప్పొచ్చు.
రూ.7.25 కోట్లతో ప్రగతి పనులు
పెద్దఅంబర్పేట, మే 17: పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. పెద్దఎత్తున మొక్కలను నాటడంతోపాటు స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టారు. పలుచోట్ల కొత్తగా సీసీ రోడ్లు వేయగా.. మరికొన్ని చోట్ల ఉన్న సీసీ రోడ్లను విస్తరించారు. పారిశుధ్య కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. ఇంటింటికీ రెండు బుట్టలను పంపిణీ చేశారు. అంతేకాకుండా మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నాటిన మొక్కలకు ప్రతిరోజూ నీటిని రెండు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. దీంతో హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా గత రెండేండ్లలో రూ. 7.25 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు.
తుర్కయాంజాల్కు రూ.12 కోట్లు..
ఇబ్రహీంపట్నం, మే 17: తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.12 కోట్ల నిధులను మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నది. ఈ నిధులతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో హరితహారం కింద మొ క్కలు నాటడంతోపాటు రోడ్లకు మరమ్మతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. సాగర్ రహదారిపై పెద్ద ఎత్తు న మొక్కలు నాటడంతోపాటు సెంటర్లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రగతిలో తుర్కయాంజాల్ ఆశించిన ఫలితాలను సాధించింది. అదేవిధంగా అధికా రులు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులను ఏర్పాటు చేశారు.
ప్రగతి బాటలో పల్లెలు..
షాబాద్, మే 17: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా ఇప్పటివరకు ప్రభుత్వం పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీలకు రూ. 104 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులతో గ్రామాల్లో వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, హరితహారం నర్సరీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెత్త సేకరణకు ట్రాక్టర్లు, మొక్కలకు నీటిని అందించేందుకు ట్యాంకర్లను కొనుగోలు చేశారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆ దారిలో వెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అన్ని కాలనీల్లోనూ సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి.
పచ్చదనాల షాద్నగర్
షాద్నగర్ టౌన్, మే 17: పట్టణ ప్రగతి కార్యక్రమంతో షాద్నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డులు సుందరంగా మారాయి. గత పట్టణ ప్రగతిలో రూ. 30లక్షలతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టారు. ఖాళీ స్థలాల్లోని మురికి చెట్ల తొలగింపు, మురుగు కాలువల శుభ్రం, శిథిలావస్థ చేరిన ఇండ్ల తొలగింపు, పలు ప్రాంతాల్లో మొక్కలను నాటి సంరక్షిస్తుండటంతో పట్టణం పచ్చదనాన్ని సంతరించుకున్నది. అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలు స్థానికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తున్నాయి. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి మొక్కల పెంపకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలోని నాలు గు పార్కులు ఎంతో శుభ్రంగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు, పిల్లలు, యువకులు పార్కుల్లో వాకింగ్ చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీ ఎంతో సుందరంగా మారిందని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి అన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
కొత్తూరు మున్సిపాలిటీలో రూ.65లక్షలతో పనులు
కొత్తూరు, మే 17: పట్టణ ప్రగతితో కొత్తూరు మున్సిపాలిటీ దశ తిరిగింది. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగింది. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీ ఏడాది కాలంలోనే మౌలిక వసతులను సమకూర్చుకున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు, రోడ్లు, మొక్కల పెంప కం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు చేపట్టారు.
గత పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా మున్సిపాలిటీలో రూ.65 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. ముఖ్యంగా రూ.25 లక్షలతో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలు, రూ.18 లక్షలతో రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. రూ.4 లక్షలతో నర్సరీ అభివృద్ధితోపాటు విద్యుత్ బిల్లుల కోసం 18.8 లక్షలను వెచ్చించారు. రూ. 3.75 లక్షలతో వీధి లైట్లను ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రగతితో ఆదిబట్లకు మహర్దశ..
ఇబ్రహీంపట్నం, మే 17: అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలున్న ఆదిబట్లను ప్రభుత్వం నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టరేట్ను నిర్మించడంతోపాటు టీసీఎస్ వంటి పలు పేరొందిన అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగ సంస్థలున్నాయి. ఈ మున్సిపాలిటీలో ఆదిబట్ల, కొంగరకలాన్, మంగల్పల్లి, పటేల్గూడ, రాందాస్పల్లి, బొంగులూరు వంటి గ్రామాలున్నాయి. దీని పరిధి మొత్తం ఔటర్రింగ్రోడ్డు చుట్టు పక్కల ఉండటంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. పట్టణ ప్రగతిలో ఈ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.4కోట్ల వరకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు పారిశుధ్యం పనులకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు సెంటర్లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
రెండు లక్షలకుపైగా మొక్కల పెంపకం
ఇబ్రహీంపట్నం, మే 17: పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి నిధులు వెల్లువలా వస్తున్నాయి. గత రెండేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ మున్సిపాలిటీకి సుమారు రూ.3 కోట్ల వరకు నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు చేపడుతున్నారు. ఇప్పటివరకు అన్ని వార్డుల్లో కలిపి సుమారు రెండు లక్షలకు పైగా మొక్కలను నాటా రు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ పల్లె ప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ సహాయంతో నీటిని అంది స్తు న్నారు. ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై పెద్ద ఎత్తున మొక్కలను నాటడంతో పాటు అన్ని వార్డుల్లో నాటేందుకు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. అలాగే, పార్కులను అభివృద్ధి చేశారు. ఇబ్రహీంపట్నం పాతబస్టాండు సమీపంలో శిథిలావస్థకు చేరిన గోడౌన్లు, విజయ టాకీస్ను కూల్చివేశారు. ఆ గోడౌన్ల స్థానంలో రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.
అన్నివార్డుల్లో అభివృద్ధి పరుగులు
షాబాద్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం నుంచి ప్రతినెలా అందుతున్న నిధులతో మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అన్ని రకాల వసతులను అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పిస్తున్నారు. గతేడాది జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపాలిటీకి ప్రభుత్వం నుంచి రూ.19.85 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో జేసీబీలతో పారిశుధ్య పనులను చేపట్టి కాలనీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. హరితహారంలో భాగంగా 30,700 మొక్కలు నాటగా, అందులో 25 వేల మొక్కలు ఏపుగా పెరిగి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాయి.
శంకర్పల్లి మున్సిపాలిటీకి గతేడాది జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూ. 19.85 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరైనట్లు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. ఆ నిధులతో మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో పలు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.