Horticulture | యాచారం, మార్చి 2 : పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కు వ శ్రమ, తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొందుతున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నారెడ్డి, కుమారుడు రజినీకాంత్రెడ్డి సద్వినియోగం చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు హార్టికల్చర్ జిల్లా అధికారి సునందారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ముత్యాలు సహకారంతో తమ పొలం లో పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టా రు. ప్రభుత్వం అందించిన సబ్సిడీపోనూ కొంత పెట్టుబడి పెట్టారు. తన కుమార్తె, కుమారుడి పట్టు పురుగుల పెంపకానికి సం బంధించిన పనులను భోజిరెడ్డే చూసుకుంటున్నాడు. అతడి నిర్వహణలో పట్టు పురుగల సాగు ఆశాజనకంగా ఉండటంతో మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన కాశమల్ల యాదయ్య కూడా ఈ పెంపకాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ర్టాల్లో మల్బరీ ప ట్టు ఉత్పత్తికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
గడ్డమల్లయ్యగూడలో పట్టు పురుగుల రకాల్లో ఒకటైన మల్బ రీ పట్టు పురుగుల పెంపకాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం రూ. 25,000 మొక్కల పెంపకానికి సబ్సిడీ కింద అందజేస్తుంది. చింతపల్లి రజినీకాంత్రెడ్డి గత ఆరు నెలల క్రితం పట్టు పురుగుల ఆహారం కోసం మూడు ఎకరాల్లో అక్కడి నేలకు అనుకూలమైన వీ1 రకానికి చెందిన మల్బరీ మొక్కలను సాగు చేశాడు. స్వప్నారెడ్డి కూడా గత ఆరు నెలల క్రితం మూడు ఎకరాల్లో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. వీరు ఆ మొక్కలకు డ్రిప్ విధానంలో నీటిని అందిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో మొక్కలను కొనుగోలు చేశారు. రవాణా, గుంతలు తీయడం, కూలీల ఖర్చులతో కలిపి ఒక్కో మొక్క పెంపకానికి రూ.పది వరకు ఖర్చు చేశారు. డ్రిప్ పరికరాల ఏర్పాటు కోసం రూ.లక్షతోపాటు మొత్తంగా మల్బరీ సాగు కోసం ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.మూడు లక్షల చొప్పున వెచ్చించారు. మల్బరీ ఆకు దిగుబడి అధికంగా ఉన్నది.
పట్టు పురుగుల పెంపకానికి కేంద్రప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభు త్వం 25 శాతం మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వెచ్చించాల్సి ఉం టుంది. రజినీకాంత్రెడ్డి, స్వప్నారెడ్డి ఇరువురు కలిసి రూ. 13 లక్షల చొప్పున మొత్తం రూ.26 లక్షలతో అన్ని వసతులతో కూడిన రేరింగ్ షెడ్లను నిర్మించారు. వీరికి రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ. నాలుగు లక్షల సబ్సిడీ వచ్చింది. ఇరువురు స్టాండ్ల ఏర్పాటు కోసం చెరో రూ.10,675లు, రూ.30,500లతో ట్రేలు, చంద్రికలు, రూ. 2,500 సున్నం ఫౌడర్ కొనుగోలు కోసం సబ్సిడీ తీసుకున్నారు. వా టిలో పెంపకానికి కావాల్సిన బెడ్స్, ట్రేలను అమర్చారు. బెడ్స్ (పడకలు, మళ్లు)పై పట్టు పురుగులను ఉంచి వాటికి మల్బరీ ఆకులు వేసి పెంచుతున్నా రు. ఈగలు, రెక్కల పురుగులు, పక్షులు లోపలికి వెళ్లకుండా నైలాన్ తెరను ఏర్పాటు చేశారు.
పట్టు పురుగుల సాగు అతి తక్కువ సమయంలోనే చేతికొస్తుంది. కేవలం 21 రోజుల్లోనే పట్టు పురుగులు పట్టు కాయలు(కకూన్స్)గా మారిపోతాయి. పట్టు పురుగులు అల్లుకున్న పట్టుగూళ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు. దీంతో రైతు ఒక నెలలోనే మంచి దిగుబడితోపాటు లాభాలను ఆర్జించొచ్చు.
మల్బరీ పట్టు పురుగుల పెంపకంతో రజినీకాంత్రెడ్డి, స్వప్నారెడ్డి మం చి లాభాలను ఆర్జిస్తున్నారు. వీరిద్దరూ ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన షెడ్లలో ఒక్కొక్కరు 125 చొప్పున 250 పట్టు పురుగులను పెంచారు. అవి 21 రోజుల్లోనే చేతికి రావడంతో స్వపారెడ్డి158 కిలో ల పట్టుకాయలను ఒక్క కిలోకు రూ.730 చొప్పున విక్రయించి రూ. 1,15,340, రజినీకాంత్రెడ్డి 131 కిలోల పట్టు కాయలను ఒక్క కిలోకు రూ.740 చొప్పున విక్రయించి రూ.96,940 ఆదాయాన్ని పొందారు. ఒక్కో పట్టు కాయలో 500 పురుగుల చొప్పున 250 కిలోల పట్టు కాయలకు సుమారు 1,25,500 పిల్లలను తయారు చేయడంతో వీరి పట్టుకాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పట్టుగూళ్ల(కాయలు)ను సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో చేపట్టిన వేలం పాట ద్వారా విక్రయించారు.
స్వప్నారెడ్డి, రజినీకాంత్రెడ్డి తన మొదటి పంటలోనే 250 కిలోల గూళ్లను (కాయలు) ఉత్పత్తి చేయడంతో జిల్లాతోపాటు రాష్ట్రంలోనూ మంచి గుర్తింపు పొందారు. 250 కిలోల పట్టు కాయలకు రూ. 2,12,280ల ఆదాయాన్ని పొంది ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాదికి 7నుంచి 10 పంటలను తీసే అవకాశముంటడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించొచ్చు. ఇటీవలే ప ట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ సునందారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ముత్యాలు స్వప్నారెడ్డి, రజినీకాంత్రెడ్డి సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం షెడ్లను పరిశీలించి వాటి ఉత్పత్తిని రైతులకు వివరించడంతోపాటు అవగాహన కల్పించారు. అనతి కాలంలోనే పట్టు పురుగుల పెంపకంలో రాణించి ఆదర్శంగా నిలిచిన వారిని అభినందించారు.
పట్టు పురుగుల పెంపకంతో మంచి లాభాలను పొందొచ్చు. గత ఆరు నెలలుగా పట్టు పురుగుల పెంపకాన్ని నిర్వహిస్తున్నా. గతంలో అనేక పంటలను సాగు చేసి నష్టపోయా. దీంతో తన కూతురు, కొడుకు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించి ప్రభుత్వం అందించిన సబ్సిడీతో రెండు షెడ్లను ఏర్పాటు చేశారు. మొదటి పంటలోనే 250 కిలోల పట్టు కాయలను విక్రయించి మంచి లాభాలను పొందాం. మల్బరీ పట్టు సాగును మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తా. 21 రోజుల్లోనే పంట చేతికి రావడం, పట్టు కాయలకు మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సాధించొచ్చు.
-చింతపల్లి భోజిరెడ్డి, రైతు గడ్డమల్లయ్యగూడ
పట్టు పురుగుల పెంపకం రైతులకు లాభసాటి గా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొంది రైతులు లాభాలు ఆర్జించొచ్చు. ప్రభుత్వం పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం ఈ పంటను సాగు చేసే రైతులకు సబ్సిడీని అందిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పురుగుల పెంపకానికి రైతులు ముందుకు రావాలి. మండలంలోని గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి గ్రామాల్లో మల్బరీ పట్టు పురుగుల పెంపకం కొనసాగుతున్నది. ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు అన్ని విధాలా సహకరిస్తాం.
– సునందారెడ్డి, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి