తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి కాలు విరిగిన సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని మాదాయపల్లి కమాన్ వద్ద మహబుబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ద్విచక్ర వాహనంపై తిరుమలయ్య, స్వామి, సాయిలు మండల పరిధిలోని మాదాయపల్లి గ్రామానికి శుభకార్యానికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు, చెన్నంపల్లి నుంచి వెల్జాల్కు వెలుతున్న బైక్ ఎదురేదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో తిరుమలయ్యకు కాలు విరిగిపోగా చికిత్స నిమిత్తం మహబుబ్నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. చెన్నంపల్లి గ్రామానికి చెంది న రమేశ్తోపాటు సాయిలు, స్వామికి స్వల్ప గాయాలయ్యాయి.