కడ్తాల్ : మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. మంగళవారం ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామానికి చెందిన వెంకటయ్య ప్యాసింజర్ ఆటో నడుపుతుంటాడు. మంగళవారం సాయంత్రం వెంకటయ్య ఆటోలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా, నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ మండలం మారెపల్లి గ్రామానికి చెందిన దోమ మైసమ్మ(68), తన కూతురు ఊరైన తలకొండపల్లి మండలం ఎడవెల్లి గ్రామానికి వెళ్లడానికి వెంకటయ్య ఆటోలో ఎక్కింది. ఆటో మార్గమధ్యలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మైసమ్మ తలకి తీవ్ర గాయలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ వెంకటయ్య మద్యం సేవించి, ఓవర్ స్పీడ్తో ఆటో నడపడంతో ఫల్టీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వెంకటయ్యపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.