కల్వకుర్తి, డిసెంబర్ 2 : కల్వకుర్తి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకుగాను ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 2,41,739 ఓట్లకు 2,01,285 ఓట్లు పోలయ్యాయి. ఇం దులో 1,02,730 మంది పురుషులు, 98,546 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 83.26 శాతంగా నమోదైంది.
కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ ముగియగానే ఈ వీఎం మిషన్లను సీవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చారు. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జైపాల్యాద వ్, కాంగ్రెస్ నుంచి కశిరెడ్డి నారాయణరెడ్డి, బీజేపీ నుంచి ఆ చారి, బీఎస్పీతో పాటు పలు పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థు లు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందుకు సంబంధించి అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లకు ఎన్నికల అధికారులు పాస్లు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించడానికి రెండు టేబుళ్లు, ఈవీఎంలలో ఓట్లు లెక్కించడానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 19 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నట్లు వారు పేర్కొన్నారు.