ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి బయటికి రావాలం టేనే జంకుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతి సహజ సిద్ధ్దంగా లభించే కొన్ని రకాల పానీయాలు, ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరిబొండం, చెరకు, నిమ్మ రసాలు, వివిధ రకాల పండ్ల రసాలు, కీర దోస తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందంటున్నారు.
-ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 9
చెరకు రసం…
కల్తీ లేని స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబొండం మొ దటిది కాగా.. రెండోది చెరకురసం. ప్రధానంగా వేసవిలో దీని విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం అనే తేడాలేకుం డా వ్యాపారులు విక్రయిస్తున్నారు. తక్కువ ధరలో లభించే చెరకు రసం లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రసం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. చెరకు రసం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరుగడటంతోపాటు ఎలాంటి వ్యాదులు దరిచేరవని చెబుతున్నారు.
కలిగే ఉపయోగాలు..
పోషకాల గని…కొబ్బరిబొండం..
కొబ్బరి బొండాన్ని పోషకాల గని అంటారు. ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో వేసవి తాపం, అలసట నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా కొబ్బరినీరు తాగాల్సిందే. మనిషి అనారోగ్యానికి గురైతే గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్లో ఉండే పోషకాలకంటే అధికంగా కొబ్బరిబొండంలో లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను తీసుకోవడం ద్వారా మానవుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం కొబ్బరినీళ్లకు ఉంటుంది. కడుపులో అప్పుడప్పుడు వచ్చే మంటలను తగ్గించేందుకు టానిక్లా పనిచేస్తుంది. మనిషి శరీరంలో లవణాల శాతాన్ని పెంచుతుంది. కొబ్బరిబొండంలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సల్ఫర్, క్లోరైడ్, ప్రో టీన్స్తోపాటు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పాలలోని ప్రోటీన్ల కంటే అధికశాతం కొబ్బరి నీళ్లలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
కీరతో ఆరోగ్యం..
మనకు తక్కువ ధరలో ఎల్లప్పుడూ అందుబాటులో వాటిలో కీరదోస ఒకటి. ఇది వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోడ్లపక్కన, తోపుడు బండ్లతోపాటు కూరగాయల మార్కెట్లోనూ కీరదోస విరివిగా లభిస్తుంది. దీనిని భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయని, రోగాలు దరిచేరవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
లాభాలు..
కీర దోసలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూస్తుంది. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా పోతాయి. సాధ్యమైనంత వరకు పొట్టు తీయకుండా శుభ్రంగా కడిగి తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎం దుకంటే కీరదోస పొట్టులో సీ విటమిన్ ఉం టుంది. దాన్ని అలాగే తీసుకోవడం ద్వారా ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సీ విటమిన్ పది శాతం అందుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో కొవ్వు తక్కువ పీచు ఎక్కువగా ఉంటుంది. మలబద్ధ్దకంతో బాధపడేవారు రోజూ తింటే ఆ సమస్య త్వరగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉండ టం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఒకవేళ తక్కువగా ఉంటే బ్యాలెన్స్ చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్న వారికే కాదు లోబీపీ ఉన్న వారికి కూడా మేలు చేస్తుంది. విటమిన్ ఏ, బీ1, బీ6, సీ, డీ విటమిన్లు, క్యాల్షియం లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కీరను క్యారెట్తో కలిపి జ్యూ స్లా తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు.
కూల్డ్రింక్స్ తీసుకోవద్దు
వేసవిలో ఎండలకు ప్రజలు నీరసించిపోతారు. ఈ క్రమంలో కొబ్బరిబొండం, చెరకు, నిమ్మరసాలను తీసుకోవటం ద్వారా శరీరానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు వీటిని తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కూల్డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.- సతీశ్కుమార్, వైద్యనిపుణుడు