రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో నివాసముండే సుధాకర్ అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.
రోజు మాదిరిగానే ఉద్యోగానికని తారమతి బారదరిలోని అగ్నిమాపక కేంద్రానికి బయల్దేరిన సుధాకర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సుధాకర్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగింది.