కొడంగల్, సెప్టెంబర్14 : నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువా రం కోస్గి మండలంలోని బిజ్జారం, చంద్రవంచ గ్రా మాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 40 మందికిపైగా ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ..ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. పిట్టకథలు చెప్పే రేవంత్ లాంటి నాయకులతో జరిగేదేమీ లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
రైతుబంధు, 24గంటల కరెంటు, బీసీబంధు, దళితబం ధు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, రైతుబీమా వంటి పలు పథకాలు తెలంగాణలో తప్ప దేశంలోని ఏ ఇతర రాష్ర్టాల్లోనూ అమలు కావడంలేదన్నారు. ఇంత మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు మనం అండగా ఉండి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు పచ్చగా ఉండటాన్ని రేవంత్రెడ్డి ఓర్వలేక పోతున్నాడని మండిపడ్డారు. అమలు కాని హామీలిచ్చే ప్రతిపక్ష పార్టీల మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభు త్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని.. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల తో అభివృద్ధి చేసినట్లు.. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.