సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరంగల్ సభ సూపర్సక్సెస్ కాబోతున్నదనే సంకేతాన్ని గ్రేటర్ గులాబీ దండు తమ సన్నాహక కార్యక్రమాలతో చాటడంతో.. జీర్ణించుకోలేని రేవం త్ సర్కార్ కుటిల రాజకీయాలకు తెరతీసింది. గ్రేటరంతా పరుచుకున్న గులాబీ పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ రాక్షసానందం పొం దింది. కనిపించిన ప్రతి బీఆర్ఎస్ పోస్టర్ను హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది అర్ధరాత్రుల్లో ప్రత్యేకంగా విధులు నిర్వర్తించి మరీ చించేశారు. ప్రకృతి విపత్తు, వరదలు తదితర అత్యవసర సమయంలో రంగంలోకి దిగాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్(డీఆర్ఎఫ్) బృందాలు సైతం అర్ధరాత్రి విధులు నిర్వర్తించి గులాబీ పార్టీ పోస్టర్ల ను చించివేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
పోస్టర్లు చిం చొద్దంటూ గులాబీ కార్యకర్తలు వేడుకున్నా వినిపించుకోకుండా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. కాంగ్రెస్ పోస్టర్లు ఎందుకు చించడం లేదంటూ నిలదీసిన ప్రజలను ఇష్టానుసారంగా తిడుతూ ఫోన్లు గుంజుకొని బెదిరించారు. పోస్టర్లను చించి వాటిని హైడ్రా సిబ్బంది తమ వాహనంలో తరలించే యత్నం చేశారు. ఈ మార్గం లో హైడ్రా వాహనం అతివేగంతో మరో వాహనాన్ని ఢీకొట్టింది. హైడ్రా వాహనం ముందుభాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఎదుటి వాహనం సైతం డ్యామేజీ అయింది. దీంతో సదరు వాహనం వ్యక్తు లు హైడ్రా సిబ్బందిని నిలదీశారు.
గోడలపై పోస్టర్లు చించేయగలరేమో…కానీ గుండెల్లో కేసీఆర్పై అభిమానాన్ని చెరపలేరంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో కనీసం ఫ్లెక్సీ పెట్టుకునే స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం. ఇదేనా ప్రజాపాలన. తెలంగాణ ప్రజల గుండెల్లో చెదరని సంతకమే కేసీఆర్ అంటూ..సాయిరామ్ అనే నెటిజన్ తన అభిప్రాయం పంచుకున్నాడు. బీఆర్ఎస్ సభ పేరు వింటేనే కాంగ్రెస్ సర్కార్లో వణుకు పడు తున్నదని మరో నెటిజన్ ప్రకాశ్ పేర్కొ న్నారు. అభిమానులు జెండాలు కట్టుకుంటే వాటిని తెల్లారేవరకైనా ఉంచకుండా చించేసి ఏమి సాధించారని దివ్య అనే నెటిజన్ ప్రశ్నించారు.