అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్.. మూడు నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిండ్రని దిగులుచెందుతున్నారు.. ఊ… అంటే… ఆ… అంటే… ఆరు గ్యారెంటీలు అంటారేగాని… పండుటాకుల పరేషాన్ను తీర్చాలన్న ధ్యాసలేదని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు… బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఠంచన్గా పింఛన్లు వచ్చేవని… కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పింఛన్లు పెంచి
అండాదెరువు లేనివాళ్ల గోసను తీర్చాలని వేడుకుంటున్నారు.
Aasara Pension | వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి మూడు నెలలు దాటినా.. పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. పాలకులు కేవలం ఆరు గ్యారెంటీలను మాత్రమే ప్రస్తావిస్తూ మిగతా వాటి ఊసే ఎత్తడంలేదు. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను పెంచుతామని ఇచ్చిన హామీని రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్ను రూ. 4000 నుంచి రూ. 6000 పెంచుతామన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన పింఛన్దారులు తమ పింఛన్ డబ్బుల పెంపు ఎప్పుడో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యారెంటీలంటూ ప్రచారం చేస్తున్నా.. వాటి అమలుకు తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేయడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడంలేదు. అదేవిధంగా ఆసరా లబ్ధిదారులకు పాత పిం ఛన్లనే అందిస్తున్నారు. డబ్బుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో
పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 20వ తేదీలోగా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను అందించగా.. ప్రస్తుతం 20 రోజులు ఆలస్యంగా పింఛన్ డబ్బులు వారికి పంపిణీ చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆసరా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి. పింఛన్ డబ్బులతోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులు, వితంతువులకు డబ్బుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు పింఛన్ డ బ్బుల పంపిణీ ప్రతినెలా 29 లేదా 30 తేదీన ప్రారంభమై వారం రోజుల్లో పూర్తవుతుండగా.. కొడంగల్ సెగ్మెంట్లోని పింఛన్దారులు మాత్రం గత నెల పింఛన్ డబ్బుల కోసం ఈ నెల రెండో వారం వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెల కొనడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ అంశం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. అయితే కొడంగల్ సెగ్మెంట్కు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరవుతుండగా…మిగతా వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నిధులు మంజూరవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 98,793 మంది పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.24.38 కోట్ల డబ్బులను పంపిణీ చేస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యా ంగులకు అండగా నిలవడంతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్ డబ్బులను పెంచింది. వృద్ధులు, వితంతువులకు ఇచ్చే ఫించన్ను రూ.200 నుం చి రూ.1000లకు..దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను రూ.500-1500 పెంచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రూ.1000-రూ.2016లకు, దివ్యాంగుల పింఛన్ను రూ.1500- రూ.3016లకు.. తదనంతరం దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు గతేడాది జూన్లో రూ.4016లకు పెంచి పేదల సర్కారుగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో పింఛన్ల నిమిత్తం జిల్లాలో రూ.1100 కోట్లకుపైగా ఖర్చు చేసింది.