షాబాద్, మార్చి 3: ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, మాట్లాడారు.
ఎవరైనా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించకపోతే సోమ, మంగళవారాల్లో వేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.