షాబాద్, ఏప్రిల్ 24: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థి జి. మల్లేశ్గౌడ్ 2వ, 3వ సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారన్నారు. సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థి ఫణి ప్రసాద్ కటకం 2వ సెట్, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరఫున ప్రతిపాదకుడు తోక అంజన్కుమార్ రెండో సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మర్క సతీశ్సాగర్ 2వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారని తెలిపారు.
వీరితో పాటు బహుజన్ ముక్తీ పార్టీ అభ్యర్థిగా పి.గోవింద్ 2 సెట్ల నామినేషన్లు సమర్పించారన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా మహ్మద్ ఆలీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాహెర్ కమల్ ఖుందుమేరీ, స్వతంత్ర అభ్యర్థిగా దాసరి సాహితి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చెంచురెడ్డి పద్మావతి, స్వతంత్ర అభ్యర్థిగా ఏ. ప్రవీణ్కుమార్, యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ అభ్యర్థి సుంకె సంపత్, స్వతంత్ర అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్, జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా కత్తుల యాదయ్య, దేశ్జనహిత్ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ షకీల్, స్వతంత్ర అభ్యర్థులుగా టి. దుర్గాప్రసాద్, ఎస్. గోపాల్, ఎస్. శ్రీనివాస్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. మొత్తం 18 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు మొత్తం 57 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు.