వికారాబాద్, మార్చి 7 : జిల్లాలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని, మిగతా 40 శాతం పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయిన వాటికి ఎఫ్టీవో జనరేట్ చేయాలని, ఎట్టి పరిస్టితిల్లోనూ ఆగకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి గ్రామ పరిధిలో జరిగే ఉపాధి హామీ పనులు పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, సంబంధిత శాఖాధికారులున్నారు.