పరిగి : ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాలకు చెందిన 27మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 17.57 లక్షలకు సంబంధించిన చెక్కులు పరిగిలోని తమ నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద సర్కారు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం వేలాదిమంది పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, నాయకులు పాల్గొన్నారు.