కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెందిన వెంకట్రెడ్డికి రూ. లక్ష, మాడ్గుల్ మండలం ఫిరోజ్నగర్కి గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 36వేలు, కల్వకుర్తి పట్టణానికి చెందిన మహేశ్వరికి రూ. 10,500 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.