కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. సోమవారం తన నివాసంలో లబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, ఉపాధ్యక్షుడు లక్పతినాయక్, నాయకులు అంజి, శ్రీనునాయక్, రామకృష్ణ పాల్గొన్నారు.