కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంజనేయులుకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష మంజూరైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీద ప్రజలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
నియోజకర్గంలో పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొడంగల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, రాఘవేందర్, విజభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.