షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురి లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాంనగర్ కాలనీకి చెందిన రవీందర్కు రూ. 60వేలు, కుమార్కు రూ. 38వేలు కళావతికి రూ. 36వేలు, హరిజన వాడకు చెందిన కృష్ణకు రూ. 16వేల 500 చెక్కులను అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్లు పాల్గొన్నారు.