మంచాల : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కొర కిషన్నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురి కారవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 60వేలు మంజూరయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే కిషన్రెడ్డి బాధితుడికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుపేదకు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులను అందజేసి వారికి అండగా నిలుస్తున్నాడని అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, టీఆర్ఎస్ నాయకులు చీమల జంగయ్య, బెల్లి గోపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు చీమల గణేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ అనిల్, అంబోత్ రాజేందర్, కిషన్ పాల్గొన్నారు.