శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ్యానికి గురైన నందిని తండ్రి వెంకట్రావుకు సీఎం సహాయనిధి రూ. 2లక్షల చెక్కును గ్రామ ఎంపీటీసీ దయాకర్రెడ్డి ఆధ్వర్యంలో అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ ఒక అన్నలా, తండ్రిలా ఆదుకుంటున్నారని కొనియాడారు. దీంతో పాటు పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. లక్ష116 అందిస్తున్నారని తెలిపారు.