ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని మల్శెట్టిగూడ గ్రామానికి చెందిన మంకాల చంద్రశేఖర్కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 60వేల సహాయనిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో ఎంతోమంది నిరుపేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అల్వాల జ్యోతి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.