చేవెళ్ల టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మోకిల గ్రామానికి చెందిన హనుమంత్రెడ్డికి సంబంధించిన రూ. 60వేల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.