పరిగి : దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ. 2లక్షలు ఎల్వోసీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంజూరు చేయించారు. ఈ మేరకు మంగళవారం పరిగిలో ఎల్వోసీ కాపీని ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.