చౌటుప్పల్ రూరల్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీపల్పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి రామకృష్ణాకు మంజూరైన రూ. 22వేల సీఎం రిలిఫ్ఫండ్ చెక్కును హైదరాబాద్లోని ఆయన నివాసంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రజల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే అర్హులందరికీ సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను అందజేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు పేదల ఆరోగ్యం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. లబ్ధిదారులు కూడా ఈ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండయాదగిరి, రంగనాథస్వామి ఆలయ చైర్మన్ రోషనగారి అశోక్గౌడ్, నాయకులు మెట్టు మహేశ్వర్రెడ్డి, ఎర అంజయ్య, సిలివేరు నరేశ్ పాల్గొన్నారు.