షాద్నగర్టౌన్, నవంబర్ 29: పేద ప్రజలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన అశోక్రెడ్డికి రూ. 60వేలు, ఆనంద్కాలనీకి చెందిన అబ్దుల్కు రూ. 56 వేలు, చటాన్పల్లికి చెందిన అనిల్కు రూ 60 వేలు, ముదిరాజ్కాలనీకి చెందిన జంగయ్యకు రూ. 60 వేలు, రామ్నగర్కాలనీకి చెందిన అనితకు రూ. 26 వేలు, అంబేద్కర్ కాలనీకి చెందిన శ్రావణికి రూ. 22 వేలు, ఫరూఖ్నగర్ మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన ఖాజా ముస్తాక్అలీకి రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. సీఎం సహాయనిధి ఆరోగ్య భద్రతనిస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు రాజేశ్వర్, శ్రీనివాస్, జీ.టీ శ్రీనివాస్, అంతయ్య, నాయకులు యుగేందర్, యాదగిరి, రాఘవేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.