ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.3.40లక్షల చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న పేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చువుతున్నాయి. వారి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నుంచి లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నారు.
ఈ పథకం కింద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు రాష్ట్రంలోనే ఎక్కువశాతం కోట్లాది రూపాయలు విడుదల చేశారని అన్నారు.
ఇబ్రహీంపట్నంప్రాంతంలో రాజకీయాలకతీతంగా ప్రతి పేదవాడికి సీఎం సహాయనిధి కింద లక్షలాది రూపాయలు అందజేసి ఆదుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలోఎంపీపీ కృపేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి,మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.