బొంరాస్పేట, ఫిబ్రవరి 12: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తండా గ్రామ పంచా తీలలో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 500 జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు 2019లో తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిం చారు. అన్ని గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పడిన తండా గ్రామ పంచాయతీ లకు ప్రభుత్వం 2019లో ఎన్నికలు నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన తండా పంచా యతీలలో గ్రామ పంచాయతీ భవనాలు లేక పోవడంతో సర్పంచ్లు పాఠశాల భవనాలు, అద్దె ఇండ్లల్లో గ్రామ పంచాయతీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్లు, ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి స్పందించిన సీఎం కేసీఆర్ ఒక్కో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1216 ఎస్టీ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున 243.20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 58 ఎస్టీ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.11.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో అత్య ధికంగా బొంరాస్పేట మండలంలోని 18 తండాలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 3.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మండలంలో మొత్తం 20 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
నిధులు మంజూరైన గ్రామ పంచాయతీలు ఇవే
ధారూరు మండలంలో పీసీఎం తండా, మోమిన్పేట మండలంలో లచ్చానాయక్తండా, మర్పల్లి మండలంలో నర్సాపూర్ పెద్దతండా, గుర్రంగట్టుతండా, కోట్పల్లి మండలంలో బార్వాద్తండా, పరిగి మండలంలో నజీరాబాద్తండా, మల్కాయపేటతండా, రూప్ సింగ్ తండా, హీర్యానాయక్తండా, పెద్దేముల్ మండలంలో ఉమ్లానాయక్తండా, చైత న్యనగర్, సిద్దన్నమడుగుతండా, ఊరెంటితండా, తాండూరు మండలంలో అంతారం తండా, గుండ్లమడుగుతండా, యాలాల మండలంలో రేళ్లగడ్డతండా, బషీర్మి యాతం డా, సంగాయగుట్టతండా, బషీరాబాద్ మండలంలో కుప్పన్కోట్, భోజ్యానాయక్తండా, హంక్యానాయక్తండా, ఇస్మాయిల్పూర్, బహదూర్పూర్ తండా, బొంరాస్పేట మం డలంలో సాగారంతండా, బొట్లవానితండా, బుర్రితండా, లోతుకుంటతండా, బాపన్ చెరువుతండా, మూడుమామిళ్లతండా, కాకర్లగండితండా, సంట్రకుంటతండా, ఎన్నె మీది తండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడిచెర్ల), సూర్యానాయక్తండా, కూబ్యానా యక్ తండా, గట్టెగానితండా, మదన్పల్లితండా, చెట్టుపల్లితండా, సత్తుర్కుంటతండా, ఎక్క చెరు వుతండా, టేకులగడ్డతండా, దౌల్తాబాద్ మండలంలో ర్యాలగుట్టతండా, కొడంగల్ మండలంలో బోయపల్లితండా, పలుగురాళ్లతండా, భవనమ్మతండా, దోమ మండలంలో పెద్దతండా, దిర్సంపల్లితండా, పల్గుతండా, గోన్యానాయక్తండా, కులకచర్ల మండలంలో భజ్యానాయక్తండా, గోగ్యానాయక్తండా, బొర్రహెమ్యాతండా, బిందెంగడ్డతండా, చెరువుముందలితండా, హన్మ్యానాయక్తండా, గోరిగడ్డతండా, చెరువుముందలి తండా (కేఎస్ఎం), బోట్యానాయక్తండాలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ. 20 లక్షల చొప్పున నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరుపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సార్కు కృతజ్ఞతలు
కొత్తగా ఏర్పాటైన తండా పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. గ్రామ పంచా యతీ భవనాలు లేక ఇండ్లను అద్దెకు తీసుకుని కార్య కలాపాలు నిర్వహిస్తున్నాం. సమావేశాలు నిర్వహించాలన్నా, రికార్డులు భద్రపరుచు కోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో కొత్త భవనాలు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.
– లక్ష్మీబాయి, సంట్రకుంటతండా సర్పంచ్
కేసీఆర్తోనే తండాల అభివృద్ధి
కేసీఆర్ సీఎం అయిన తరువాతనే లంబాడీ తండాలు అభివృద్ధి అవుతున్నాయి. తండాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ప్రక టించి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం సంతోషం. నిధులు మంజూరు చేయాలని సర్పంచ్లు, ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి సీఎం సారూ స్పందించినందుకు ధన్యవాదాలు.
-బుడ్డీబాయి, ఎన్నెమీదితండా(వడిచెర్ల) సర్పంచ్