రంగారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దారు. సర్కారు ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు..
రాష్ట్ర ఏర్పాటుకు ముందు కుటుంబ సంక్షేమ పథకాలు, మాతాశిశు-ఆరోగ్యం, టీకాలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమం, బాలింతల వంటి ఆరోగ్య కార్యక్రమాలు సాధారణ స్థాయిలో లభించేవి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో జిల్లాలో 37 పీహెచ్సీలతో ఆరోగ్య సేవలు అంద గా.. ప్రస్తుతం 37 పీహెచ్సీలతోపాటు పట్టణ ప్రాంత బస్తీ లు, మురికి ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 81 బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. వాటిలో 58 ప్రారం భం కాగా మిగితావి వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా పట్టణ పరిధిలో 27 పట్టణ ఆరోగ్య కేంద్రాలు మంజూరు కాగా వాటిలో 24 కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగతావి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
గ్రామీణ ప్రజల కోసం..
గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 158 పల్లె దవాఖానలు మంజూరు కాగా.. అందులో 82 దవాఖానలు ప్రారంభమై ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా రాష్ట్ర స్థాయి సూపర్ స్పెషాలిటీ దవాఖానలపై పని భారం తగ్గి, స్పెషాలిటీ సేవలు అం దించేందుకు వీలు కలుగుతున్న ది. ప్రభుత్వం మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎంతో కృషి చేస్తున్నది.
కేసీఆర్ కిట్ పథకం..
కేసీఆర్ కిట్ పథకంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. ఈ పథకం క్రింద అమ్మా యి జన్మిస్తే రూ.13వేలు, అబ్బాయి జన్మిస్తే రూ.12 వేల నగదును ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 2,18,310 గర్భవతులకు రూ.67,96,88,000 ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం కూడా బాగా పెరిగింది.
కంటి వెలుగు..
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమ మొదటి విడుతను సక్సెస్గా పూర్తి చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఈ ఏడాది జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేప ట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి అక్కడే మందులతోపాటు అద్దాలు ఇస్తున్నారు. మే నాటికి 7,54,756 మందికి పరీక్షలు చేసి, 98,184 మంది కి రీడింగ్ గ్లాసెస్ అందించారు. 86,819 మంది కోసం వైద్యులు ప్రిస్క్రిప్షిన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. కాగా జూన్ చివరి నాటికి 10 లక్షలు చేరాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఎన్నో బృహత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సామాన్యులకూ కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభు త్వ దవాఖానలను అన్ని వసతులతో తీర్చిదిద్దారు. అవసరమైన సిబ్బందిని భర్తీ చేశారు. ప్రభుత్వ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటేశ్వరరావు, రంగారెడ్డి డీఎంహెచ్వో