రంగారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలంగాణ ఏర్పడే నాటికి మన ప్రాంతంలో గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కరెంటు కోతలు, పవర్ హాలీడేలను విధించేవారు. హైదరాబాద్లో ప్రతిరోజూ 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో ఏకంగా 12 గంటల పాటు కోతలు విధించేవారు. సరిపడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పారిశ్రామిక ప్రాంతాల్లో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్తు కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన ఘటనలున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు, మూ డు గంటలపాటు కూడా విద్యుత్తు సరఫరా కాక భూములు బీటలు వారి పంటలు ఎండిపోయేవి. లోవోల్టేజీ సమస్యతో నిత్యం మోట ర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. ఇలాంటి సమస్యలతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విభజన చట్టం ప్రకారం సరఫరా చేయాల్సిన విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే, తెలంగాణ ఏర్పడే నాటికి కరెంట్ కొరత తెలంగాణలో 2,700 మెగావాట్లు ఉన్నట్లు సమాచారం.
నేడు విద్యుత్తు విజయోత్సవ సభలు రంగారెడ్డి కలెక్టర్ హరీశ్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. శాసనసభా నియోజక వర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులోని సామ నర్సింహారెడ్డి గార్డెన్లో జరుగనున్న సభకు మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరవుతారన్నారు. మిగ తా నియోజకవర్గ కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు పా ల్గొంటారన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితులు, స్వరాష్ట్రంలో సాధించిన విద్యుత్ విజయాల గురించి వివరిస్తారన్నారు.
విద్యుత్ కోతలకు చెక్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల నుంచే కోతల్లేని విద్యుత్తును ప్రజలకు అందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. పంటల సాగుకు తగినంత నీరు బోరు, బావుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్తు కోతలతో రైతులు పంటలను సరిగ్గా సాగు చేసుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.
వారి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్
నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టారు. దీంతో కరెంట్ కోతలు, పవర్ హాలీడేలకు చెక్ పెట్టారు. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది.
జిల్లాలో 1,20,713 మంది రైతులకు లబ్ధి..
తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జిల్లాలో రూ. 3,198 కోట్లతో విద్యుత్తు సరఫరాను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. 27,516 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం రూ.138 కోట్లను ఖర్చు చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా 1,20,713 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్స్ 181 ఉండగా, నేడు 276 పెరిగాయి. గతంలో అన్ని కేటగిరీలకు కలిపి 11,97,885 కనెక్షన్లుండగా, నేడు 21, 31,319 కనెక్షన్లకు పెరిగాయి.
సైబర్ సిటీ పరిధిలో సాధించిన ప్రగతి రాష్ట్ర ఆవిర్భావం నుంచి సైబర్ సిటీ సర్కిల్ (చేవెళ్ల, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో) పరిధిలో రూ. 3,268.74 కోట్లతో విద్యుత్తు సరఫరాను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
కాగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు రూ.44.55 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. సైబర్ సర్కిల్లో పల్లెప్రగతి పనులు రూ.1.52 కోట్ల వరకు జరిగాయి. సైబర్ సర్కిల్ పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పౌల్ట్రీ నేపథ్యంలో తీసుకున్న సబ్సిడీ మొత్తం రూ.6,57,48,905లు. పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా రూ.4.46 కోట్ల పనులు జరిగాయి. ఇంకా, వేలాది మంది నాయీ బ్రాహ్మణులు, రజకులకు 100 యూని ట్ల మేర విద్యుత్ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది.