దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య, ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దశాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్కు అత్యాధునిక వసతులతో కూడిన మరో 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్లో దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా అమ్మవారికి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో ఎంపీ కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్