ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన భారతయ్య అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 40వేల చెక్కును శనివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు.