108 ambulance | ఆపదలో ఆదుకుని ప్రాణాలు నిలిపే వాహనానికే ఆపద ఎదురైంది. 108 అంబులెన్స్ రోడ్డుపైనే ఆగిపోవడంతో రోగి తీవ్రంగా ఇబ్బందిపడింది. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో ఇంట్లో జారిపడి భూక్య జెమిలి(85) అనే వృద్ధురాలి కాలికి గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. జెమిలిని అంబులెన్స్ వాహనంలో దవాఖానకు తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయింది. మరో 108 వాహనం వచ్చే వరకువృద్ధురాలు ఇబ్బంది పడుతూ అదే వాహనంలో ఉండిపోయింది. ప్రాణ నష్టం జరకగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నడిరోడ్డుపై ఆగిపోయిన 108 అంబులెన్స్
మరో అంబులెన్స్ వచ్చే వరకు రోగి అవస్థ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాలో ఇంట్లో జారిపడి భూక్య జెమిలి(85) అనే వృద్ధురాలి కాలికి గాయం
108 అంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని… pic.twitter.com/xTd8touTlH
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026