వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లికి చెంది లక్ష్మీకి రూ. 1.50లక్షలు, ఎన్నెపల్లిలోని ఎండి మొహిజ్కు రూ. 47వేలు, సాయిబాబా కాలనీలోని అంజమ్మకు రూ. 14వేలు, సుభాష్నగర్కు చెందిన రాజుకు రూ. 60వేలు, గంగారంకు చెందిన మౌనికకు రూ. 24వేల విలువగల చెక్కులను అందజేశారు.
5 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 2.95లక్షలు సీఎం సహాయ నిధి నుంచి అందజేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, నాయకులు సురేష్ ఉన్నారు.