సభా వేదికపై మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, మహేశ్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు
కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, సురభి వాణిదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, గోరటి వెంకన్న, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, శాట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రారంభించారు.. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.. సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించి సర్వమత పూజలు చేశారు.. కలెక్టర్ వెంకట్రావును కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు..
నాడు వలసలు.. నేడు పాడి పంటలు
నాడు కరువు, వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు.. తెలంగాణ ఏర్పడ్డాక పాడిపంటల ఖిల్లాగా మారింది.. సాగునీటి రాకతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు.. రైతు ఇంట ధాన్యపు రాశులే దర్శనమిస్తున్నాయి.. సంక్షేమంలో తెలంగాణకు ఎవరూ సాటి లేరు.. ఉద్యమ సమయంలో నేను, జయశంకర్ సార్, లక్ష్మారెడ్డి కలిసి నవాబ్పేట మైసమ్మ అడివిని చూసి ఆశ్చర్యపోయాం.. చెట్లుకూడా బక్కపడ్డాయి అని ఆవేదన చెందాం.. ఈ జిల్లా దుస్థితి చూసి కండ్లళ్ల నీళ్లు పెట్టుకున్నాం.. కానీ నేడు పాలమూరులో పల్లెర్లు మాయమైనవి.. ముంబయి బస్సులు బంద్ అయిపోతున్నయ్.. వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నరు.. నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ సాధించిన.. ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుంది..
పర్యటన సాగిందిలా..
మహబూబ్నగర్/టౌన్/మూసాపేట, డిసెంబర్ 4 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన సాఫీగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అప్పన్నపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 5:15 వరకు జిల్లాలో పర్యటించారు.