హైదరాబాద్ : ఎల్ నినో ( El Nino ) ప్రభావంతో తెలంగాణలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను( IAS Officers ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ( Special Officers ) నియమించింది.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లాకు వికాస్ రాజ్, కరీంనగర్ జిల్లాకు బెనహర్ మహేశ్ దత్తా ఎక్కా, మెదక్ జిల్లాకు ఏ వాణి ప్రసాద్ను నియమించింది. నిజామాబాద్ జిల్లాకు యోగితా రాణా, నల్గొండ జిల్లాకు హరి చందన దాసరి, ఆదిలాబాద్కు ఇలాంబర్తి, వరంగల్కు ఎ.శ్రీదేవిసేన, మహబూబ్నగర్కు వి.పి గౌతమ్, ఖమ్మం ఉమ్మడి జిల్లాకు అనుదీప్ దురిశెట్టిని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక అధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, తాగు నీరు, భూగర్భ జలమట్టాలు, వ్యవసాయ సాగు, విద్యుత్ సరఫరా వివరాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 20 వ తేదీన అన్ని జిల్లాలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.