మాల్. సెప్టెంబర్ 17 : ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధే లక్ష్యమని మాల్ మండలం తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, శివర్ల పర్వతాలు యాదవ్, సందె లక్ష్మయ్య, గ్రామ పెద్దలు మర్రు రామారావు, సిమర్ల శ్రీను యాదవ్, జూలురి శ్రీధర్, శివర్ల రాములు, దాసరి మల్లయ్య, రాశిక పాండయ్య, గంటెల ఆంజనేయులు, కొన్రెడ్డి నర్సింహా, బెక్కం సత్తయ్య, బొడ్డు నర్సింహారెడ్డి, రామయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.