హైదరాబాద్లోని ప్రగతి భవన్లో శుక్రవారం మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్లను మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్రెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వై.అంజయ్యయాదవ్ గెలుపు కోసం తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని వివరించారు. పార్టీ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని, కారు గుర్తు గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులు సూచించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి మంత్రులను కలువడంతో ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు తెరపడినట్లు అయిందని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
– షాద్నగర్, అక్టోబర్ 13
మొయినాబాద్, అక్టోబర్ 13 : గులాబీ కండువా మన గుండె నిండా ఉందని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని చేవెళ్ల ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రంజిత్రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే యాదయ్య వస్తేనే గ్రామాల్లోకి వెళ్లాలని కాదని… ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసి యాదన్నను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలన్నారు. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గ్రామాల్లో స న్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
శుక్రవా రం మండల పరిధిలోని హిమాయత్నగర్, ఎన్కేపల్లి, బాకారం జాగీర్ గ్రామాల్లో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అధ్యక్షతన సన్నాభక సమావేశాలు నిర్వహించారు. ఎన్కేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పదేండ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, గెలుపు కోసం ఎలా పని చేయాలనే అంశాలపై అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తె లంగాణలో తలసరి ఆదాయం పెరగడంతో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందన్నారు.
యాదయ్యను ఆశీర్వదించండి
ప్రజల కోసం ఎమ్మెల్యే యాదయ్య 18 గంటల పాటు పని చేస్తున్నారని ఎంపీ తెలిపారు. 45 రో జుల పాటు ప్రజల మధ్య ఉండి వారి నుంచి కా రు గుర్తుకు ఓటు వేయించి యాదన్నను భారీ మె జారిటీతో గెలుపిస్తే యాదన్న ఐదేండ్ల పాటు మ న కోసం పని చేస్తారన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి యాదన్నను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షు లు జయవంత్, సుధాకర్యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, హిమాయత్నగర్ సర్పంచ్ మంజులారవియాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సంఘం రాజూగౌడ్, ఎన్కేపల్లి ఎంపీటీసీ రితీశ్రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, బాకారం సర్పంచ్ రాఘవరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ కమి టీ అధ్యక్షుడు నర్సింహ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, డైరెక్టర్లు రాజూగౌడ్, బిక్షపతిగౌడ్, కుమ్మరి రాము, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవియాదవ్, రాఘవేందర్యాదవ్, దర్శన్, స్వా మి, యాదయ్య, లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్, మాజీ వైస్ ఎంఫీపీ జీఎన్ రాజు, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షు డు పరమేశ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమే శ్, మోత్కుపల్లి ఉపసర్పంచ్ కిరణ్, వారు ్డసభ్యు డు వెంకటేశ్, నాయకులు డేవిడ్, మిట్టు, భాస్క ర్, రత్నం, యాదగిరిచారి, సునీల్, సత్యనారాయణగౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి అంతా చేవెళ్ల వైపే..
హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద నగరంగా రూపాంతరం చెందిందని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధిని దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను ఎత్తివేసిందని చెప్పారు. చేవెళ్ల ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు. చేవెళ్ల, వికారాబాద్ ప్రాంత ప్రజలకు సులువుగా, మెరుగైన రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చాలనే ఆలోచనతో హైదరాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు వేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆలోచన చేస్తున్నదన్నారు.