మొయినాబాద్, నవంబర్ 29: ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు.
అందులో భాగంగా చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు గణిత నమూనాలు, ఆర్ట్, లిటరేచర్ అనే ఆంగ్ల నమూనాలను ప్రదర్శించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారిని ఆర్సీవో శారద మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి రమాదేవి పాల్గొన్నారు.