చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధిదారులకు చేవెళ్ల మండల అధ్యక్షుడు ప్రభాకర్తో కలిసి ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందిస్తున్నమన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వాటిని సకాలంలో అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో కందవాడ ఎంపీటీసీ రవిందర్, నాయకులు ప్రభాకర్, రాములు, రవి, సాయినాత్, ప్రభాకర్రెడ్డి ఉన్నారు.