చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. అనంతరం నూతన ప్రధాన కార్యదర్శి పామెన వెంకటేశ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతానికి పాటుపడుతూ, ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా కృషి చేస్తానన్నారు.
సంక్షేమ రంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ముందుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలను సైతం పట్టణాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎమ్మెల్యే యాదయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఎంపీటీసీ సత్యనారాయణ, టీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు నరేందర్గౌడ్ నాయకులు ఉన్నారు.